22-ఏ రద్దు చేయాలి.. ప్రజల భూములపై ఈ ‘నిషేధం’ ఎందుకు? గుజ్జ సత్యం
22-ఏ రద్దు చేయాలి.. సామాన్యుడి భూమికి సంకెళ్లు వద్దు: గుజ్జ సత్యం
తెలంగాణలో 22-ఏ నిబంధన పేరుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా చట్టబద్ధంగా తమ పేరుపై ఉన్న భూములు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చిక్కుకోవడం, పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం, రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో ఆస్తి విలువ కోల్పోయే పరిస్థితి ఏర్పడటం ప్రజలకు తీవ్ర నష్టమని ఆయన అన్నారు. భూ రక్షణ పేరుతో సామాన్యుడి ఆస్తి హక్కులను దెబ్బతీసే విధానం ఇక కొనసాగరాదని, తప్పులున్న రికార్డులను సరిచేసి పారదర్శక వ్యవస్థను తీసుకురావడంతో పాటు 22-ఏ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read More